న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. ప్రతిరోజు రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 2.85 లక్షల కేసులు నమోదవగా, తాజాగా అవి 2.86 లక్షలకు చేరాయి. అదేవిధంగా యాక్టివ్ కేసులతోపాటు, రోజువారీ పాజిటివిటీ రేటు కూడా పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 2,86,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,03,71,500కు చేరాయి. ఇందులో 3,76,77,328 మంది కోలుకోగా, 22,02,472 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,91,700 మంది మృతిచెందారు. కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 573 మంది మృతిచెందారని, 3,06,357 మంది వైరస్ నుంచి బయటపడ్డారని ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరిందని వెల్లడించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 1,63,84,39,207 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నది.
ఇక ఒమిక్రాన్ కేసులు 8209కి చేరాయి. ఇందులో 3109 మంది కోలుకున్నారని తెలిపింది. మరో 5100 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 1738 నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్లో 1672, రాజస్థాన్ 1276, ఢిల్లీలో 549 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.