న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మళ్లీ కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ 11.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,85,914 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 665 మంది మృతి చెందారు. మరో 2,99,073 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22,23,018 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,63,58,44,536 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇక సోమవారం 3 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, మంగళవారం 2.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.