న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 2685 కరోనా కేసులు నమోదవగా, 33 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా, 5,24,572 మంది బాధితులు వైరస్కు బలయ్యారు. ఇప్పటివరకు 4,26,09,335 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 16,308 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2158 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతానికి పెరిగిందని, యాక్టివ్ కేసులు 0.04 శాతం, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. శుక్రవారం 14,39,466 మందికి వ్యాక్సినేషన్ చేశామని, దీంతో ఇప్పటివరకు 1,93,13,41,918 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.