న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా (Corona) కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు. ఇంకా 15,419 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా, 2582 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో 532 ఉండగా, కేరళలో 596, మహారాష్ట్రలో 307, హర్యానాలో 257, ఉత్తరప్రదేశ్లో 139 కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో 77.45 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.
రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.22 శాతంగా ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇప్పటివరకు 1,91,79,96,905 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేయగా, నిన్న ఒక్కరోజే 13,71,603 మంది వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పింది.