న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు మరోసారి 20 వేలు దాటాయి. గత కొన్ని రోజులు 20 వేలలోపే నమోదవుతుండగా, నేడు కొత్తగా 20,551 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,41,07,588కి చేరాయి. ఇందులో 4,34,45,624 మంది బాధితులో వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,600 మంది మరణించారు. మరో 1,35,364 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనాతో 70 మంది మరణించగా, 21,595 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతానికి చేరిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.50 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 205.59 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.