న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,38,018 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 20,071 కేసులు తగ్గాయి. మరో వైపు కరోనాతో 310 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 1,57,421 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43శాతంగా ఉందని తెలిపింది. మరో వైపు దేశంలో ఇప్పటి వరకు 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, నిన్నటితో పోలిస్తే 8.31శాతం పెరిగాయని చెప్పింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,76,18,271కు చేరింది. ఇందులో 3,53,94,882 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 4,86,761 మంది మృత్యువాతపడ్డారు.