న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 14,148 కేసులు నమోదవగా, తాజాగా 13 వేలకు తగ్గాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటుకూడా తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,94,345కు చేరాయి. ఇందులో 4,22,46,884 మంది కోలుకోగా, 5,13,226 మంది బాధితులు మరణించారు. మరో 1,34,235 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 302 మంది మహమ్మారికి బలవగా, 26,988 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 1,76,86,89,266 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.