కొలంబో: ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశానికి బలగాలను పంపిస్తున్నట్లు వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. శ్రీలంకకు ఇండియా పూర్తిగా మద్దతు ఇస్తుందని, ఆ దేశ ప్రజాస్వామ్యానికి, స్థిరత్వానికి, ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వనున్నట్లు కొలంబోలోని భారత హై కమిషన్ వెల్లడించింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుటుంబసభ్యులు ఇండియాకు పారిపోయినట్లు వస్తున్న ప్రచారాన్ని కూడా ఇండియన్ మై కమిషన్ కొట్టిపారేసింది. సోమవారం రాజీనామా చేసిన తర్వాత రాజపక్స ఎక్కడికి వెళ్లారో ఇంకా తెలియదు. ఊహాజనిత నివేదికలపై కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అలాంటి రిపోర్ట్లను భారత ప్రభుత్వం ఆమోదించడం లేదని హై కమిషన్ తన ట్విట్టర్లో తెలిపింది.