న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత మూడురోజులుగా 17 వేలకుపైగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు తాజాగా, 16,103కు పడిపోయాయి. దీంతో మొత్తం కేసులు 4,35,02,429కి చేరాయి. ఇందులో 4,28,65,519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,199 మంది మృతిచెందారు. మరో 1,11,711 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 31 మంది కరోనాకు బలవగా, 13,929 బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
ఇక మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 197.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.