న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 2323 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,34,145కు చేరాయి. ఇందులో 4,25,94,801 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 5,24,348 మంది మరణించగా, 14,996 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 25 మంది కరోనాకు బలవగా, 2346 మంది డిశ్చార్జీ అయ్యారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కేరళలో 556 కేసులు ఉండగా, ఢిల్లీలో 530, మహారాష్ట్రలో 311, హర్యానాలో 262, ఉత్తరప్రదేశ్లో 146 చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల్లోనే 77.7 శాతం కేసులు ఉన్నాయి.
మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక శుక్రవారం ఒకే రోజు 15,32,383 మందికి వ్యాక్సినేషన్ చేశామని, మొత్తంగా ఇప్పటివరకు 1,92,12,96,720 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.