న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ రెండు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 2067 మంది కరోనా బారినపడగా, కొత్తగా 2380 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,30,49,974కు చేరాయి. ఇందులో 4,25,14,479 మంది కోలుకోగా, 5,22,062 మంది మృతిచెందారు. 13,433, కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటివీ రేటు 0.53 శాతానికి పెరిగింది.
గత 24 గంటల్లో 56 మంది కరోనాకు బలవగా, 1231 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 4.5 లక్షల మందికి పరీక్షలు చేశామని తెలిపింది. ఇప్పటివరకు 187.07 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.