న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం మూడు వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా 4 వేల 5 వందల మందికి పాజిటివ్ వచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 4575 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,75,883కు చేరాయి. ఇందులో 4,24,13,566 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,355 మంది బాధితులు మరణించగా, 46,962 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కాగా, గత 24 గంటల్లో 145 మంది మృతిచెందారని, 7416 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.11 శాతం మాత్రమే ఉన్నాయని, 98.69 శాతం మంది కోలుకున్నారని తెలిపింది. 1.20 శాతం మంది మృతిచెందారని వెల్లడించింది. ఇక 1,79,33,99,555 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. మంగళవారం ఒక్కరోజే 18,69,103 మంది వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.