న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,88,118కి చేరాయి. ఇందులో 4,25,44,689 మంది కోలుకోగా, మరో 5,23,920 మంది మృతిచెందారు. ఇంకా 19,509 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 31 మంది వైరస్కు బలవగా, 2802 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గత కొన్నిరోజులుగా భారీగా రోజువారీ కేసులు నమోదవుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని, మరణాల రేటు 1.22 శాతమని పేర్కొన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,89,48,01,203 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీచేశామని, మంగళవారం ఒక్కరోజే 4,79,208 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.