న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 2827 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,13,413కు చేరాయి. ఇందులో 4,25,70,165 మంది బాధితులు కోలుకున్నారు. మరో 19,067 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,181 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 24 మంది కరోనాకు బలవగా, 3230 మంది డిశ్చార్జీ అయ్యారు.
ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 98.74 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని, 1.22 శాతం మంది మరణించారని తెలిపింది. ఇప్పటివరకు 1,90,83,96,788 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, బుధవారం ఒక్కరోజే 14,85,292 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.