న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 19 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 18,738కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,78,506కు చేరాయి. ఇందులో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మరణించారు. మరో 1,34,933 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 40 మరణించగా, 18,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదయిందని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.50 శాతం, యాక్టివ్ కేసులు 0.31 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 205.21 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.