న్యూఢిల్లీ, జనవరి 11: ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్థాన్తో కలిసి ఈ ర్యాంకును పంచుకుంది. భారతీయులు 62 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. హెన్లీ పాస్పోర్ట్ సంస్థ విడుదల చేసిన 2024 సూచికలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాయి.
ఈ దేశాల పౌరులు 194 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించొచ్చు. ఫిన్లాండ్, స్వీడెన్, దక్షిణ కొరియా సంయుక్తంగా రెండో ర్యాంకు దక్కించుకున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్ మూడో ర్యాంకును పొందాయి.