న్యూఢిల్లీ: అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇండో, పాక్ నౌకలు ఢీకొన్నాయి(Ship Collision). ఈ ఘటనపై ఇవాళ భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నౌకాదళ వ్యవహారం ఆమోదయోగ్యంగా లేదని, దాని ప్రవర్తన ప్రొఫెషనల్గా లేదని భారత్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. భారతీయ నేవీ నౌకను పాక్ నేవీ నౌక ఢీకొన్నట్లు విదేశాంగ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అంతర్జాతీయ జలాల్లో జరిగినా, భారతీయ నౌకకు డ్యామేజ్ జరగలేదని, కానీ పాకిస్థాన్ నౌకాదళ ప్రవర్తన సరిగా లేదని భారత్ పేర్కొన్నది.
1991 నాటి నౌకావిన్యాసాల అగ్రిమెంట్లోని ఆర్టికల్ 10 ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకనలో తెలిపింది. గత రాత్రి అరేబియా సముద్రంలో ఈ ఘటన జరిగినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థానీ విదేశాంగ శాఖకు ఈ విషయాన్ని చేరవేసినట్లు భారత్ తెలిపింది. పాక్ మిలిటరీ యూనిట్లు అన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ విదేశాగ శాఖ ముందు నిరసన వ్యక్తం చేయాలని ఇస్లామాబాద్లోని భారత ఎంబసీకి చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది.