న్యూఢిల్లీ: దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారిపై ఈ ఏడాది చివరికల్లా విజయం సాధించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ చివరికల్లా దేశంలో వ్యాక్సినేషన్ను పూర్తిచేసేందుకు అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని కొవిడ్-19 వ్యాక్సిన్లపై ఏర్పాటైన నేసనల్ టాస్క్ఫోర్స్ అధ్యక్షుడు, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ పౌల్ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కా చెప్పారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ నెలల మధ్య దేశంలో మొత్తం 216 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయని వినోద్ కుమార్ పౌల్ తెలిపారు. ఇప్పటికే 18 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తికాగా జూలై చివరికల్లా మరికొన్ని కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని, ఆగస్టు తర్వాత మరో 216 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని, వాటితో దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పూర్తవడమేగాక మరికొన్ని డోసులు మిగిలే ఉంటాయని చెప్పారు.
కొత్తగా అందుబాటులోకి రానున్న టీకాల్లో కొవిషీల్డ్ 75 కోట్ల డోసులు, కొవాగ్జిన్ 55 కోట్ల డోసులు, బయో ఈ సబ్ యూనిట్ వ్యాక్సిన్ 30 కోట్ల డోసులు, జైడస్ క్యాడిలా డీఎన్ఏ 5 కోట్ల డోసులు, ఎస్ఐఐ నోవావాక్స్ 20 కోట్ల డోసులు, భారత్ బయోటెక్ ఇంట్రానాజల్ 10 కోట్ల డోసులు, జెనోవా ఎంఆర్ఎన్ఏ 6 కోట్ల డోసులు, స్ఫుత్నిక్ వీ 15.6 కోట్ల డోసులు ఉన్నాయని వినోద్ కుమార్ పౌల్ వెల్లడించారు.
ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధికంగా అమెరికాలో 26 కోట్ల డోసులను పంపిణీ చేశారని పౌల్ చెప్పారు. 18 కోట్ల డోసులతో భారత్ మూడో స్థానంలో ఉన్నదన్నారు. స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ రష్యా నుంచి భారత్కు వచ్చిందని, వచ్చే వారం నుంచి ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో భారత ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోయే వ్యాక్సిన్ల గురించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేసినట్లు చెప్పారు.