న్యూఢిల్లీ : అంతరిక్ష నిఘా సామర్థ్యాల్ని పెంచుకునే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ఇస్రో ద్వారా రోదసిలోకి ప్రయెగించిన ఓ ప్రైవేట్ సంస్థ శాటిలైట్ ‘ఇన్ ఆర్బిట్ స్నూపింగ్’ను విజయవంతంగా నిర్వహించింది. అహ్మదాబాద్కు చెందిన అజిస్టా అనే సంస్థకు చెందిన 80 కిలోల ‘ఏఎఫ్ఆర్’ అనే శాటిలైట్, ఫిబ్రవరి 3న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) ఫొటోలు తీసింది.
ఈ కొత్త టెక్నాలజీతో రోదసిలో తిరుగుతున్న శత్రు దేశాల శాటిలైట్స్ను కూడా గమనించివచ్చు. సెకన్కు కొన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఐఎస్ఎస్ను ట్రాక్ చేస్తూ, 15 భిన్నమైన ఫొటోల్ని ఇది పంపింది. భారత్కు చెందిన రూ.50 వేల కోట్ల విలువైన 50కి పైగా శాటిలైట్స్ అంతరిక్షంలో ఉన్నాయి.