న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వివక్షాపూరితంగా భారతీయులపై క్వారంటైన్ ఆంక్షలను విధించిన బ్రిటన్కు భారత్ షాక్ ఇచ్చింది. భారత్కు వచ్చే బ్రిటన్వాసులు తప్పనిసరిగా పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని నిబంధన విధించింది. వ్యాక్సినేషన్తో సంబంధం లేకుండా నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ సర్టిఫికేట్ ఉన్నవారినే దేశంలోకి అనుమతిస్తామని తెలిపింది. అక్టోబర్ 4 నుంచి ఇండియాకు వచ్చే బ్రిటన్ పౌరులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణానికి 72 గంటల ముందు, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత, 8వ రోజున ఆర్టీ-పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది. భారత్ తాజా నిర్ణయంపై బ్రిటన్ స్పందించింది. భారత ప్రయాణికులకు నిబంధనలను సరళతరం చేస్తామని పేర్కొన్నది.