న్యూఢిల్లీ, నవంబర్ 18 : ప్రస్తుత టెక్ యుగంలో ఈమెయిల్ నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్దాకా, సామాజిక మాధ్యమాల నుంచి ఆన్లైన్ షాపింగ్ యాప్ల దాకా అనేక వాటికి పాస్వర్డ్లను వాడుతుంటాం. వీటన్నింటినీ గుర్తు పెట్టుకోవడం తేలిక కాదు. దీంతో సులభంగా గుర్తుండేలా చాలా మంది వరుస నంబర్లు, ఆల్ఫాబెట్లను వినియోగిస్తుంటారు. ఇలాంటి సాధారణ పాస్వర్డ్ల వల్ల సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదముంది. సైబర్ నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్లో అనేక మంది సాధారణ పాస్ట్వర్డ్లు వినియోగిస్తున్నట్టు తేలింది. ఎక్కువమంది ‘password’ అనే పదాన్నే పాస్వర్డ్గా వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. జపాన్లో కూడా ఇదే తీరు. నార్డ్పాస్ అనే సంస్థ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
భారత్లో అత్యధికమంది ‘password’, 12345, 123456, 123456789, 12345678, india123, 1234567, 123123, qwerty, abc123, iloveyou, abcd1234, 1qaz వంటి పదాలను పాస్వర్డ్లుగా వాడుతున్నారు. అలాగే krishna, sairam, omsairam వంటి ఆధ్యాత్మిక పదాలను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. iloveyou, sweetheart, lovely వంటి వాటిని కూడా అధికంగా వాడుతున్నారు. ఈ పాస్వర్డ్లను నిమిషంలోపే క్రాక్ చేయొచ్చని నార్డ్పాస్ సంస్థ పేర్కొన్నది.
పాస్వర్డ్ కనీసం 8 క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి.
అప్పర్కేస్, లోయర్ కేస్ లెటర్లు, నంబర్లు కలిపి పాస్వర్డ్గా పెట్టుకోవాలి.
వ్యక్తిగత సమాచారం (పేరు, పుట్టిన తేదీ వంటివి) వాడకపోవడమే మంచిది.