గాంధీనగర్: భారత దేశం మరో విపత్తును ఎదుర్కోంటోందని, నార్కో టెర్రర్ రూపంలో ఆ విపత్తు ఎదురవుతోందని, దాన్ని అడ్డుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలను(నార్కోటిక్స్ ) ఇండియాలోకి ఎంటర్ కానివ్వమని, ప్రధాని మోదీ నేతృత్వంలో ఆ మార్గాలను మూసివేస్తున్నామన్నారు. భారత్కు నార్కో టెర్రర్ రూపంలో మరో ముప్పు పొంచి ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో.. గుజరాత్లోని ఫోరెన్సిక్ వర్సిటీతో కేంద్రం లింకును ఏర్పర్చుకుందన్నారు.