Rajnath Singh : భారత దేశాన్ని ప్రపంచానికి డ్రోన్ హబ్గా మార్చడమే తమ లక్ష్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాన్ని ప్రపంచానికి డ్రోన్ హబ్గా మార్చడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. దేశం డ్రోన్ హబ్ మారడం భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని.. మేక్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతదేశం కార్యక్రమానికి గణనీయంగా దోహదపడుతుందని అన్నారు.
తాము IDEX, ADITI పథకాల ద్వారా ఆవిష్కరణలకు అవార్డులను కూడా ప్రారంభించామని రాజ్నాత్ తెలిపారు. భారత్ నుంచి పెరుగుతున్న రక్షణ వస్తువుల ఎగుమతిలో కృషి ఫలాలను చూస్తున్నామని, ప్రస్తుతం భారతదేశం 100 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందని ఆయన తెలిపారు. 2023-24లో భారత్ నుంచి రక్షణ ఎగుమతులను దిగుమతి చేసుకున్న దేశాల్లో మొదటి మూడు స్థానాల్లో అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియా ఉన్నాయని చెప్పారు.
2029 నాటికి తాము రూ.50 వేల కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశిస్తున్నామని రక్షణ మంత్రి చెప్పారు. సైబర్ స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సాంకేతికతపై పనిచేసే ప్రముఖ దేశాల జాబితాలో చేరేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే DRDO ప్రాజెక్ట్ల కోసం AI ఫ్రేమ్వర్క్, మార్గదర్శకాలను అనుసరిస్తున్నామన్నారు. జాతీయ భద్రతకు వ్యతిరేకంగా యుద్ధ ముప్పును ఎదుర్కోవడం కోసం రక్షణ వ్యూహాన్ని అనుసరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.