న్యూఢిల్లీ :రక్షణరంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకుగాను 928 మిలటరీ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు రక్షణశాఖ వర్గాలు ఆదివారం ప్రకటించాయి. డిసెంబర్ 2023-డిసెంబర్ 2029 మధ్యకాలంలో బ్యాన్ చేస్తున్న రక్షణ ఉత్పత్తుల జాబితాను కేంద్రం విడుదల చేసింది.
సుఖోయ్ 30, జాగ్వార్ ఫైటర్ జెట్స్, హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 విమానాలకు చెందిన వివిధ పరికరాలు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, గ్యాస్ టర్బైన్ జనరేటర్లు.. మొదలైనవి ఇతర దేశాల నుంచి దిగుమతికి అవకాశం లేదని, భారత్లోని వివిధ సంస్థల నుంచి నిర్దేశిత సమయంలో సేకరించాల్సి వుంటుందని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు.