PM Modi | న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కేంద్రంలోని మోదీ సర్కారు పాలనలో భారత్ అన్ని రంగాల్లోనూ తిరోగమనం చెందుతున్నది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ అట్టడుగున నిలిచినట్లు ఇటీవలి నివేదికలో వెల్లడైన విషయం తెలిసిందే. పొరుగుదేశాలతో పోలిస్తే భారత యువతలో నిరుద్యోగిత రేటు అధికంగా ఉన్నట్టు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. భారత్తో పోలిస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్టు పేర్కొన్నది.
36 % దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యని 15-34 ఏండ్ల వయస్కుల్లో సుమారు 36 శాతం మంది అభిప్రాయపడ్డారు. లోక్నీతి-సీఎస్డీఎస్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.