న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని అందుకున్నాం. ఇండియాలో ఇప్పటి వరకు 70 కోట్ల మంది కరోనా టీకాలు ఇచ్చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. అయితే గడిచిన 13 రోజుల్లోనే పది కోట్ల మంది కోవిడ్ టీకాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. తన ట్విట్టర్లో రియాక్ట్ అయిన మంత్రి.. ప్రధాని మోదీ నాయకత్వంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు హెల్త్ వర్కర్లకు, ప్రజలకు మంత్రి మాండవీయ థ్యాంక్స్ చెప్పారు. తొలి పది కోట్ల డోసులను 85 రోజుల్లో, 20 కోట్ల టీకాలను 45 రోజుల్లో, 30 కోట్ల డోసులను 29 రోజుల్లో, 40 కోట్ల డోసులను 24 రోజుల్లో, 50 కోట్ల డోసులను 20 రోజుల్లో, 60 కోట్ల డోసులను 19 రోజుల్లో, ఇక 70 కోట్ల డోసులను 13 రోజుల్లో ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
Soaring higher on #COVID19 vaccination under PM @NarendraModi ji's leadership.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 7, 2021
7⃣0⃣,0⃣0⃣,0⃣0⃣,0⃣0⃣0⃣
vaccine doses administered to date
Congratulations to all the health workers and people for this momentous achievement. #SabkoVaccineMuftVaccine pic.twitter.com/g7xA0iAhpJ