న్యూఢిల్లీ, జూన్ 3: రోదసి నుంచి జారిపడే గ్రహశకలాలను ముందస్తుగా గుర్తించేందుకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ను భారత్లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలోని ఓ పర్వతంపై సముద్రమట్టానికి 2,450 మీటర్ల ఎత్తున దీన్ని పెట్టారు. 4 మీటర్ల వ్యాసంతో, పాదరసంతో నిండిన ఈ టెలిస్కోప్ను భారత్, బెల్జియం, కెనడా పరిశోధకులు రూపొందించారు.