UN world map : నూతనంగా రూపొందించిన ప్రపంచ పటానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. ఐక్యరాజ్యసమితిలో ‘కరెక్ట్ ద మ్యాప్’ పేరుతో నూతన ప్రపంచ పటానికి మద్దతుగా సెప్టెంబర్ 4న ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా అనుకూలంగా ఓటేసింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఇదే సమయంలో ఇండియా అధికారికంగా ప్రకటించిన పటంలో ఉన్నట్లుగానే జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాలు ఇండియాలోనే ఉండేలా చూడాలని ఐక్యరాజ్యసమితిని హెచ్చరించింది. నూతన ప్రపంచ పటంలో ఈ ప్రాంతాలను తప్పుగా చూపించినా, సరిగ్గా లేకున్నా సహించబోమని ఐరాసకు వార్నింగ్ ఇచ్చింది. తాజా ప్రపంచ పటం ఒక దేశ జాతీయ సరిహద్దుల్ని నిర్ణయించలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటించారు. అంటే, ఇండియా సరిహద్దులతోపాటు ఏ దేశ సరిహద్దులు కూడా మారమోవు.
Our response to media queries regarding a UN General Assembly resolution on equal-area world map ⬇️
🔗 https://t.co/sAnpGhX3fA pic.twitter.com/Cfyn3jMcOG
— Randhir Jaiswal (@MEAIndia) September 6, 2026
అయితే, ఇండియాలో కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాలను తప్పుగా చూపించకూడదని కూడా ఆయన అన్నారు. ఐరాసలో ఈ తీర్మానాన్ని 193 సభ్య దేశాలకుగాను.. హాజరైన 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఒక్క అమెరికా మాత్రమే ఈ ప్రపంచ పటాన్ని వ్యతిరేకిస్తోంది. కారణం.. కొత్త ప్రపంచ పటంలో అమెరికా కాస్త చిన్నగా కనిపించబోతుండటమే. అలాగే, ఇండియాతోపాటు ఆఫ్రికా ఖండం కాస్త పెద్దగా కనిపించబోతుంది.