పాట్నా: సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల మహానంద ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ సంఘటన వల్ల ఆ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (Mahananda Express Derail) 15483 అలీపుర్దువార్ జంక్షన్-ఢిల్లీ సిక్కిం మహానంద ఎక్స్ప్రెస్ ఆదివారం ఉదయం 4.12 గంటలకు బీహార్లోని ఆరా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ రెండుకు చేరుకున్నది.
కాగా, ఢిల్లీ వెళ్లాల్సిన ఆ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన సమయంలో సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ససారం అప్ లైన్ వైపు సిగ్నల్ చూపించడంతో ఆ రైలు ముందుకు కదిలింది. అయితే స్టేషన్కు సుమారు 200 మీటర్ల దూరంలో అది పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఎస్ఎల్ఆర్, హెచ్-1 కోచ్ చక్రాలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన వల్ల ఆ మార్గంలో రైళ్ల రాకపోకలతకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక బృందాలు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పట్టాలు తప్పిన రైలు ఇంజిన్, బోగీలను ట్రాక్పైకి ఎక్కించే పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ససారం లైన్ వైపు సిగ్నల్ మళ్లడానికి దారితీసిన పరిస్థితులు, ఆ రైలు తప్పుడు దిశలో ఎలా ప్రయాణించిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.
3 coaches off the tracks, Zero injuries.
Mahananda Express derailed near Arrah, Bihar this morning engine + 2 coaches left the rails.
Delhi–Howrah line hit with delays/diversions.
Early reports point to a signal/router issue speed was low, which likely prevented casualties.… pic.twitter.com/Pgnu65P2xb— GlobePulses (@GlobePulses) September 6, 2026