కీవ్: రష్యా బలగాలు కీవ్ను చట్టుముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీవ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ నగరంలో ఉన్న భారతీయులంతా ఇవాళే కీవ్ను వదిలివెళ్లాలని ఆదేశించింది. విద్యార్థులతో పాటు కీవ్లో ఉన్న భారతీయులంతా ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాలని భారత ఎంబసీ తన ట్వీట్లో తెలిపింది. అందుబాటులో ఉన్న రైళ్లు లేదా ఇతర మార్గాల ద్వారా ఈ నగరాన్ని తక్షణమే విడిచి పెట్టి వెళ్లాలని కోరింది. ఏ క్షణమైనా కీవ్ నగరంపై భీకర దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు భారతీయ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆపరేషన్ గంగాకు వాయుసేన కూడా తోడవ్వనున్నది. ఆపరేషన్ గంగా కోసం వాయుసేనకు చెందిన సీ-17 గ్లోబ్మాస్టర్ విమానాన్ని వాడనున్నట్లు తెలుస్తోంది.