న్యూఢిల్లీ, నవంబర్ 29: అన్నదాతలు ఇక పురుగుల మందులను ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ఈ-కామర్స్ సంస్థల ద్వారా పురుగుల మందు విక్రయాలకు కేంద్ర సర్కారు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. లైసెన్సులు పొందిన వ్యాపారులు నిబంధనలకు లోబడి ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఏ పురుగుల మందునైనా అన్నదాతల ఇంటికే చేర్చొచ్చని తెలిపింది. ఈ నిర్ణయంతో పురుగుల మందు తయారీదారులు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొనేందుకు మార్గం సుగమమైంది. అలాగే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా రైతులు సులభంగా పురుగుల మందులను ఇంటివద్దకే తెప్పించుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.