టెహ్రాన్, ఏప్రిల్ 23 : భారత పౌరులెవ్వరూ ఇరాన్కు వాయు మార్గంలో కానీ, రోడ్డు మార్గంలో కానీ వెళ్లవద్దని భారత విదేశాంగ శాఖ తాజా అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండటంతో ఇరాన్-భారత్ మధ్య విమాన సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించిన క్రమంలో టెహ్రాన్లోని భారత ఎంబసీ ఈ అడ్వైజరీ జారీ చేసింది.
అంతేకాకుండా ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు నిర్దేశిత భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్ను విడిచి వెళ్లాలని, ఈ క్రమంలో వారి కోసం రెండు ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. సరిహద్దు దాటే పౌరులు కచ్చితంగా భారత దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని కోరింది.