INDIA Alliance | లక్నో: ప్రతిపక్ష ఇండియా కూటమిలో అప్పుడే ప్రధాని పదవిపై రచ్చ మొదలైంది. పార్టీల మధ్య పోస్టర్వార్ నడుస్తున్నది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భావి ప్రధాని అంటూ ఆ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఓ పోస్టర్ వెలిసింది. కాంగ్రెస్ కార్యాలయం వద్ద తాజాగా ఓ పెద్ద బ్యానర్ను ఏర్పాటు చేశారు.
దీనిలో ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీతోపాటు, ఉత్తర ప్రదేశ్ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ కూడా ఉన్నారు. ‘2024లో రాహుల్ గాంధీ పీఎం, 2027లో అజయ్ రాయ్ సీఎం’ అని దీనిలో ఉంది. దీనిపై సమాజ్వాదీ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ ఎన్ని పోస్టర్లు ఏర్పాటుచేసినా, అఖిలేశ్ యాదవే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేత హసన్ పేర్కొన్నారు.