న్యూఢిల్లీ: మధుమేహం, రక్తపోటు తదితర 54 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. సవరించిన ధరల జాబితాలో డయాబెటిస్, బీపీ మందులతోపాటు గుండె జబ్బులు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, మల్టీ విటమిన్ల మందులు ఉన్నాయి.
డయాబెటిస్ రోగులు అధికంగా వినియోగించే మెట్ఫార్మిన్, లినాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్ ధరలను ట్యాబ్లెట్కు రూ.15 నుంచి రూ.20 కూ పెంచారు. సిప్రోఫ్లోక్సాసిన్ యాం టీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ రిటైల్ ధరను మిల్లీలీటర్కు 23 పైసలుగా నిర్ధారించారు. రక్తపోటుకు వినియోగించే టెల్మీసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ మందుల ధరను ట్యాబ్లెట్కు రూ.7.14గా సవరించారు. కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగించే ఆస్పిరిన్, ఆటోర్వాస్టాటిన్ కాంబినేషన్ మందును క్యాప్సుల్కు రూ.2.68గా మార్చారు. ఇక కాల్షియం, విటమిన్ డీ3 పిల్స్ ధరలను ట్యాబ్లెట్కు రూ.7.82 వద్ద ఫిక్స్ చేశారు.