మావు: ఆదాయపన్ను శాఖ అధిరారులు ఇవాళ సమాజ్వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదతో లింకు ఉన్న పలువురి ఇండ్లల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. తనకు ఎటువంటి నేరచరిత్ర లేదని, తన వద్ద నల్లధనం కూడా లేదని రాజీవ్ రాయ్ అన్నారు. ప్రజలకు హెల్ప్ చేస్తుంటానని, కానీ ప్రభుత్వానికి ఇది నచ్చడం లేదన్నారు. దాని వల్లే ఇలా ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మీరేదైనా చేస్తే, వాళ్లు వీడియో చేసి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, ఓ కేసులో అన్యాయంగా ఇరికిస్తారని రాయ్ ఆరోపించారు. యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఐటీశాఖ సోదాలు చేస్తోంది. ఆర్సీఎల్ గ్రూపు ప్రమోటర్ మనోజ్ యాదవ్కు చెందిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. మెయిన్పురిలోని ఆయన ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.