చెన్నై : ఏఐఏడీఎంకే పత్రిక నమదు అమ్మ పబ్లిషర్ చంద్రశేఖర్ నివాసం, కార్యాలయంపై ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి చంద్రశేఖర్ అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు.
చంద్రశేఖర్ నివాసం, కార్యాలయం ఉన్న కోయంబత్తూర్ వేదవల్లి ప్రాంతంలో ఐటీ దాడులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.