న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ ఏస్ గ్రూపుపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఆగ్రాలో ఉన్న ఏస్ గ్రూపు ప్రమోటర్ అజయ్ చౌదరీ నివాసాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఏస్ గ్రూపునకు చెందిన 40 స్థానాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చైర్మన్ అజయ్ చౌదరీ.. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్కు సన్నిహితుడు. ఎన్సీఆర్ ప్రాంతంలో చౌదరీ ప్రఖ్యాత బిల్డర్గా పేరుగాంచాడు. ఇటీవల ఎస్పీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ నివాసాల్లోనూ ఐటీ శాఖ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.