న్యూఢిల్లీ: బీబీసీ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో ఆ సంస్థల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం బీబీసీ పేరు పేర్కొనకుండా ఒక ప్రకటన విడుదల చేసింది. సర్వేలో పన్నులకు సంబంధించి జరిగిన అవకతవకలు గుర్తించామని తెలిపింది. ఆదాయంపై నిర్దిష్ఠ పన్ను చెల్లించలేదని తేలిందని పేర్కొంది. ఉద్యోగుల స్టేట్మెంట్లు, డిజిటల్ ప్రూఫ్లు, ఇతర డాక్యుమెంట్లు, తదితర కీలకమైన ఆధారాలను ఐటీ బృందాలు వెలికితీశాయని తెలిపింది.