జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానున్నది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. దీనికి గుర్తుగా నవంబర్ 26నే కొత్త పార్లమెంట్ను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ తేదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటిస్తారని, ఆమె చేతుల మీదుగానే భవనాన్ని ప్రారంభించనున్నట్టు ఓ సీనియర్ కేంద్ర మంత్రి మీడియాతో చెప్పారు. కాగా, కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.