చెన్నై: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) తమిళనాడు విభాగం మాజీ నేత ఆర్బీవీఎస్ మణియన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ రూపశిల్పి ఒక వ్యక్తి కాదని, రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన దాదాపు 300 మంది రాజ్యాంగానికి తుదిరూపు ఇచ్చారని చెప్పారు. రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ సభకు చైర్మన్ అని, అంబేద్కర్ కేవలం డ్రాఫ్టింగ్ కమిటీకి మాత్రమే చైర్మన్ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రాసిన ఘనతను రాజేంద్రప్రసాద్కు ఇవ్వాలన్నారు.
అంబేద్కర్ కేవలం ఓ గుమస్తాగా వ్యవహరించారన్నారు. ఆయన రాజ్యాంగ ముసాయిదాను రాసి, టైప్ చేసి, తప్పొప్పులను సరిదిద్దారని చెప్పారు. రాజ్యాంగంలోని క్లాజుల్లో కనీసం ఒకటి అయినా అంబేద్కర్ రాసినది కాదనే విషయం మీకు తెలుసా? అని ప్రశ్నించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మణియన్ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయనకు స్థానిక కోర్టు 27 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.