చెన్నై: తమిళనాడు(Tamilnadu)లోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న కోవిల్పట్టి గ్రామ సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఓమ్నీ బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు నుంచి నాగర్కోయిల్కు బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సిమెంట్ మిక్సర్ లారీని బస్సు ఢీకొట్టింది. ప్రమాదం వల్ల బస్సులో ఉన్న సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో మరో యాక్సిడెంట్ జరిగింది. ఓ బస్సును ఢీకొన్న కారులోని ముగ్గురు మృతిచెందారు. వాళ్లు బెంగుళూరు నుంచి పెన్నాగారంకు ఓటు వేసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.