కరూర్, నవంబర్ 3: తమిళనాడులో మళ్లీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు జరిపారు. అధికార పార్టీ డీఎంకే నేత, మంత్రి ఈవీ వేలు, డీఎంకే దివంగత నాయకుడు వసుగి మురుగేశన్కు చెందిన ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
తిరువణ్ణామలైలో వేలు స్థాపించిన అరుణై ఇంజినీరింగ్ కాలేజీ, కరూర్లోని మురుగేశన్ సోదరి ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు. గాంధీపురంలోని ఓ ఫైనాన్స్ సంస్థ, థొట్టకురుచ్చిలోని డీఎంకేకు చెందిన ఓ నాయకుడి ఇల్లు ఇలా మొత్తం 10 చోట్ల సోదాలు జరిగాయి.