న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ముగించింది. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులు ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 2012లో షీనాబోరా (25) దారుణ హత్యకు గురైంది. ఓ టీవీ ఛానెల్ యజమాని అయిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు.
2015లో వేరే కేసులో ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అని అరెస్ట్ చేయడంతో హత్య విషయం బయటపడింది. షీనా హత్యలో ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖ్యర్జియాలతోపాటు శ్యామ్వర్ రాయ్ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దాంతో నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు ఒక ప్రధాన చార్జిషీట్తోపాటు రెండు అనుబంధం చార్జిషీట్లను దాఖలు చేసింది. మొత్తం 60 మంది సాక్ష్యులను విచారించింది.
అయితే కేసు దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో ప్రొసీజర్ ప్రకారం బాంబే హైకోర్టుకు సీబీఐ అధికారులు దరఖాస్తు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయినందున తదుపరి దర్యాప్తును మూసివేస్తున్నట్లు ఆదేశాలు ఇవ్వాలని ఆ దరఖాస్తులో కోరారు.