ఇంఫాల్: మణిపూర్ మళ్లీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. సోమవారం భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. (Gunfire in Manipur) మణిపూర్లోని సరిహద్దు పట్టణమైన మోరేలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో గత రాత్రి నుంచి తుపాకుల మోత మోగుతున్నది. భద్రతా దళాల లక్ష్యంగా తిరుగుబాటుదారులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో అదనపు భద్రతా బలగాలను మోరేకు తరలించారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మణిపూర్లో మైతీ, కుకీ వర్గాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ప్రారంభమైన హింస మరో మలుపు తిరిగిందని ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలపై తిరుగుబాటుదారులు దాడి చేసే పరిస్థితిగా మారిందని చెప్పారు. కొత్త సంవత్సరంలో భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల మధ్య హింస జరుగుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సంఘర్షణ కోణం మారిందని తెలిపారు. తాజాగా తీవ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు పోరాడుతున్నాయని చెప్పారు.
Gunfight between insurgents and security forces continues today in Manipur’s border town Moreh; intermittent firing since last night. Reinforcements have been sent to Moreh. No reports of injuries or casualties. #Moreh #Manipur pic.twitter.com/ue8RWG2YJg
— Debanish Achom (@debanishachom) January 8, 2024