భోపాల్: నదిలో పడవ తిరగపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని సింధ్ నదిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న పది మంది ఒక పడవలో తిరుగుప్రయాణమయ్యారు. అయితే భింద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఆ బోటు నదిలో బోల్తాకొట్టింది. దీంతో పడవలోని పది మంది నదిలో పడిపోయారు. మునిగిపోతున్న వారు హాహాకారాలు చేశారు. తమను రక్షించాలంటూ ప్రాణభయంతో అర్తనాదాలు చేశారు.
మరోవైపు ఒడ్డున ఉన్న కొందరు గమనించి వెంటనే నదిలోకి దూకారు. ఎనిమిది మందిని కాపాడారు. ఒక బాలిక, బాలుడు గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్కు చెందిన ద్రౌపతి బాఘేల్ (16), ఓం బాఘెల్ (13)గా వారిని గుర్తించారు. గల్లంతైన వారిద్దరి కోసం గాలిస్తున్నట్లు నయాగావ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేంద్ర సింగ్ కుష్వాహ తెలిపారు. కాగా, ఒడ్డున ఉన్నవారు తమ మొబైల్లో రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A boat carrying 10 persons capsized in Sindh river in Bhind eight persons were rescued and two were missing. They were returning after attending a religious feast @ndtv @ndtvindia pic.twitter.com/fpJrE3Y769
— Anurag Dwary (@Anurag_Dwary) January 29, 2022