న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం పాలసీ కేసులో ఆరోసారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 19న తమ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది. అయితే తనను అరెస్ట్ చేయడానికి చట్టవిరుద్ధ ప్రయత్నాలు జరుగుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను నిరోధించే లక్ష్యంగా ఈడీ సమన్లు జారీ చేస్తున్నదని విమర్శించారు. ఈడీ జారీ చేసిన ఐదు సమన్లకు ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు ఈడీ తాజాగా ఆరోసారి సమన్లు జారీ చేసింది.
కాగా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ సమన్లకు స్పందించకపోవడంపై ఫిబ్రవరి 3న రోస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన కోర్టు, ఎవరినైనా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసే అధికారం ఈడీకి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్రిబవరి 17న కోర్టుకు హాజరుకావాలంటూ అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది.