న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఢిల్లీలో లెఫ్ట్నెంట్ గవర్నర్, అధికార ఆప్ మధ్య వివాదం మరింత ముదురుతున్నది. డైలాగ్ అండ్ డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ ఇండియా (డీడీసీడీ) వైస్ చైర్మన్ జాస్మిన్ షాపై ఎల్జీ వీకే సక్సేనా విధించిన ఆంక్షలను రీకాల్ చేయాలని ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. జాస్మిన్ షా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొం టూ ఆయన విధులు నిర్వర్తించకుండా ఎల్జీ ఆదేశాలిచ్చారు. అయితే, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఇచ్చిన ఫిర్యాదుతో జాస్మిన్ షాపై ఎల్జీ చర్యలు తీసుకోవటం న్యాయబద్ధంగా చెల్లదని కేజ్రీవాల్ తాజా ఆర్డర్ జారీ చేశారు. గతంలో మాదిరే డీడీసీడీ సాధారణ పనితీరు కొనసాగాలని పేర్కొన్నారు.