రాయ్పూర్ : కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో సర్కారీ దవాఖానల్లో వైద్య సదుపాయాలు ఘోరంగా ఉన్నాయి. రాజధాని రాయ్పూర్కు 25 కిలోమీటర్ల దూరంలోని అబన్పూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఒక బాలుడు రోగి పక్కన చేతిలో స్లైన్ సీసా పట్టుకొని నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ రోగి కూర్చోవడానికి చక్రాల కుర్చీ లేదా స్ట్రెచర్ అందుబాటులో లేదు. స్లైన్ సీసా తగిలించడానికి స్టాండ్ కూడా లేదు. ఓ టీవీ ఛానల్ దవాఖానను పరిశీలించగా.. అక్కడ రోగులకు దిండ్లు, దుప్పట్లు, మంచి నీరు అందుబాటులో లేనట్టు తెలిసింది. దీంతో ఆ రాష్ట్ర సర్కార్పై విమర్శలు వస్తున్నాయి.