న్యూఢిల్లీ : బైక్పై ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని ఎక్కించుకుని ఆపై రెండు కుక్కలు, రెండు కోళ్లను కూడా తీసుకువెళ్లిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా పిల్లలు సహా ఆరుగురు వ్యక్తులు బైక్పై ప్రయాణిస్తూ కనిపించారు. వీరితో పాటు రెండు కుక్కలు, కోళ్లు కూడా బైక్ జర్నీలో పాలుపంచుకున్నాయి.
ये अगर पकड़ा गया, इसको चालान भरने के लिए लोन लेना पड़ेगा। 😅 pic.twitter.com/pkbnD216md
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 18, 2022
ఈ క్లిప్ను చూస్తుంటే ఎవరికైనా అసలు మేమిద్దరం..మాకిద్దరు అనే స్లోగన్ను మనోడు ఎప్పుడూ విన్నట్టు లేదేమో అనే సందేహం కలుగకమానదు. ఇక ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేశారు. ఈ షార్ట్ క్లిప్ను ఆన్లైన్లో షేర్ చేసిన తర్వాత ఇప్పటివరకూ 2.58 లక్షల వ్యూస్ వచ్చాయి.
బైక్పై ఇంతమంది ప్రయాణించడం చాలా ప్రమాదకరమని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల భద్రత పట్ల ఆ వ్యక్తికి అసలు ఏమాత్రం బాధ్యత లేదని కొందరు యూజర్లు మండిపడ్డారు. ఇలాంటి ఉల్లంఘనులకు భారీగా జరిమానా వడ్డించాలని మరికొందరు పేర్కొన్నారు. ఇంతమంది ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నావని ఆ వ్యక్తిని కొందరు ప్రశ్నించారు.