న్యూఢిల్లీ : చాక్లెట్ సాస్, ఉడకబెట్టిన ఆలు, భుజియాతో ఓ వ్యక్తి రాజ్ కచోరి చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బంగ్లాదేశ్ నుంచి వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ కాంబినేషన్పై పలువురు ఫుడ్ లవర్స్ పెదవివిరిచారు.
ఫుడ్ బ్లాగర్ ది గ్రేటఖ్ ఇండియన్ ఫుడీ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60,000 వ్యూస్ వచ్చాయి. ఈ వైరల్ వీడియోలో కచోరిలో ఓ వ్యక్తి బాయిల్డ్ ఆలు, జీడిపప్పు, భుజియా, చనా, చాక్లెట్ సాస్తో కూడిన పెరుగును మిక్స్ చేస్తుండటం కనిపించింది. పెరుగులో చాక్లెట్ను జోడించడం ఏం టేస్ట్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు.